Search
Close this search box.
Search
Close this search box.

జనసేన నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

జనసేన

        రాజాం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ముచ్చ.శ్రీనివాసరావు పిలుపు మేరకు నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం బుచ్చింపేట సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా MPTC అభ్యర్థి సామంతుల.రమేష్ రెడ్డి, బాలకృష్ణ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. బుచ్చింపేట నాయకులు నమ్మి.దుర్గారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో యు.పి.రాజు ఆధ్వర్యంలో మా గ్రామ కూడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందిని అన్నారు. ఆయన సంతృప్తి వ్యక్తపరుస్తూ జనసేన బలోపేతానికి మరింత కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వట్టి.రామకృష్ణ మీసాల, లక్ష్మునాయుడు ఈశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way