Search
Close this search box.
Search
Close this search box.

రైతన్నకు అండగా రిలే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన నాయకుల వినతి

రైతన్న

              పశ్చిమ గోదావరి తణుకు మండలం దువ్వ గ్రామంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ భారతీయ కిసాన్ సంఘం, రైతులు, రైతుసంఘ నేతలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో తహశీల్దార్ పి. ఎన్. డి. ప్రసాద్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కిసాన్ సంఘ్ జిల్లా సభ్యులు తొంట సత్యన్నారాయణ గారు మాట్లాడుతూ రైతుకు తక్షణమే డబ్బులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తణుకు మండలంలో రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలల వ్యవధి కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం రైతును మోసం చేయటమేనని జనసేన నాయకులు అనుకుల రమేష్ అన్నారు. చేశారు. ఈ కార్యక్రమంలో జంపన సూర్య చంద్రరాజు, రుద్ర సతీష్ , కోలపల్లి వెంకట శ్రీనివాస్, రుద్ర మాణిక్యం, ఈదరపల్లి మురళి, ఇందుకూరి వెంకటరామరాజు జంపన సత్యన్నారాయణ రాజు, కడియం శ్రీను రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way