Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన నాయకులు పూల శివప్రసాద్

ఎమ్మెల్యే

             పుట్టపర్తి ( జనస్వరం ) : కొత్తచెరువులోని 2,3వ వార్డులలో సచివాలయాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. జనసేన పార్టీ మండల కన్వీనర్ పూల శివప్రసాద్ పుట్టపర్తి నియోజవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్తచెరువులో గడిచిన మూడు సంవత్సరాల కాలం నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యేని నిలదీశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయి సంవత్సరాలు గడుస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొత్తచెరువు కూడలి రోడ్లలో డివైడర్ల పైన ఉన్న వీధిలైట్లు కూడా నెలల తరబడి పని చేయకున్నా ఇంతవరకు వాటిని మరమ్మతులు చేయలేదన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో BC కాలనీలో పర్యటించి ప్రజలతో మమేకమవ్వగా అక్కడ రోడ్లకి సరైన సైడ్ కాలువలు లేక రోడ్లు మొత్తం మురికి గుంటలుగా తయారైపోయాయని , పంచాయతీ వారు కనీసం శానిటైజేషన్ కూడా చేయట్లేదని ప్రజలు వాపోతున్నారన్నారు. దర్గా వీధిలో ఉన్న మసీదు దగ్గర ఉన్న రోట పరిస్థితి కూడా డ్రైనేజి కాలవలు లేక అధ్వానమైన దుస్థితిలో ఉందని ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి అన్నిటి పైన తక్షణమే తగిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేని నిలదీయగా, త్వరలోనే పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way