సర్వేపల్లిలో పారిశుధ్య కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

సర్వేపల్లి

               సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నందు జనసేన పార్టీ నాయకులు బోబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడాలి అనే ఉద్దేశంతో కుటుంబాలను కూడా పక్కనపెట్టి కష్టపడుతున్న డాక్టర్లు, పోలీస్ వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులు అందరికీ చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతుగా గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్, కూరగాయలను అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు అందించాలని జనసేన పార్టీ తరపున కోరారు. రాబోయే రోజుల్లో వర్షాలతో కాలువలు నిండిపోయి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కావున పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగించాలనీ ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా కాపాడాలని జనసేన పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాయి, ప్రవీణ్, సందీప్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way