Search
Close this search box.
Search
Close this search box.

అల్లూరు వైద్యసిబ్బంది నియామకంలో ప్రభుత్వ జాప్యాన్ని ఖండిస్తూ జనసేన నాయకుల నిరసన

అల్లూరు

      నెల్లూరు ( జనస్వరం ) : అల్లూరు ప్రభుత్వ ప్రజావైద్యశాలలో వైద్యసిబ్బంది నియామకంలో ప్రభుత్వ జాప్యాన్ని ఖండిస్తూ అల్లూరు ప్రభుత్వ ప్రజావైద్యశాల వద్ద భారతీయ జనతాపార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. జనసేన నాయకులు మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాల మీద దృష్టి సారించి ప్రజలకి మెరుగైన వైద్య అందించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. అల్లూరు ప్రభుత్వ ప్రజావైద్యశాలలో తక్షణమే వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు. లేని పక్షంలో జనసేనపార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కలిగించకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అలాగే కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way