వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

వైసీపీ

        ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గం బూర్జ మండలం మదనాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు స్థానికంగా జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో స్థానిక వైసిపి కి చెందిన కొందరు దుండగులు వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం దాడిలో గాయపడ్డ గల్లంకి శ్రీనివాసరావు మరియు సావిత్రమ్మ లను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నేతల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకులు తరచూ ఇటువంటి భౌతిక దాడులకు దిగుతున్న పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తోందని మండిపడ్డారు.జనసేన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way