
ఈరోజు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు క్యాన్సర్ మీద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ వ్యాధితో యువత మరియు గంజాయి అనేక వాటికి బానిస అయిపోయి క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులు కాలేజీకి పంపించేటప్పుడు జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని జనసేన పార్టీ తెలియజేస్తుందని అన్నారు. గుట్కా వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళందర్నీ పట్టుకుని కఠినంగా శిక్షించాలని కేంద్రం ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షానవాజ్ గారు. సుబ్బు, బాబ, కార్తీక్, శివయ్య, ఉదయ్, శీను, వెంకీ, చక్రి తదితరులు పాల్గొన్నారు.