జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలు నిర్వహించిన గోరంట్ల జనసేన నాయకులు

గోరంట్ల

         గోరంట్ల, (జనస్వరం) :  గోరంట్ల మండలములో  స్థానిక శ్రీ వినాయక మందిరంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  గారి జన్మదినం పురస్కరించుకొని జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలికల హాస్టల్ లో కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించి పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెపుతాము అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన నాయకులు అందరూ మరింతగా కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని మరియు ఏ రాష్ట్రంలో లేని రోడ్లు మన రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా చాలా దారుణంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో రోడ్లు బాగా చేయకపోతే అక్టోబర్ 2 వ తేదీన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన నాయకులు అందరం కలిసి శ్రమదానం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి సురేష్, సంతోష్, మల్లికార్జున వీర మహిళ కావేరి, మధు, చిన్న, బాబజాన్, బాబర్, మహేష్, అమర్, రవి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way