కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి ఆర్థిక సాయం చేసిన గన్నవరం జనసేన నాయకులు

   గన్నవరం, (జనస్వరం) : గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున మచిలీపట్నంలో నివాసం ఉంటున్న ఇల్లూరి వీరబాబు కోబ్బరి కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. వారికి చాణిక్య అనే ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఈ మధ్యకాలంలో ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం కారణంగా హాస్పిటల్ కి తీసుకువెళ్తే డాక్టర్లు టెస్టులు చేసి బాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కిడ్నీ పూర్తిగా చెడిపోయింది వెంటనే కిడ్నీ తీసేయాలి అని చెప్పటం జరిగింది. దీనికి దాదాపుగా ఆరు లక్షల ఖర్చు అవుతుంది అని డాక్టర్లు తెలియజేశారు. ఆ సమయంలో ఆ బాబు తండ్రి జనసేన పార్టీ నాయకులు గుంటుపల్లి హర్ష ని సంప్రదించడం జరిగింది. గుంటుపల్లి హర్ష తన స్నేహితుల ద్వారా కార్యకర్తల ద్వారా అందరికీ తెలియజేసి రెండు సార్లుగా 60000 వేల రూపాయలు విరాళాలు సేకరించి ఆ బాబు తండ్రికీ అందచేయటం జరిగింది. జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు ఆధ్వర్యంలో 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు లంకే సురేష్, జనసేన వీర మహిళ మేకల స్వాతి, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ బాబు కుటుంబానికి ఎప్పుడు అండగా వుంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున దన్యవాదాలు తెలియజేడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way