చిత్తూరు జిల్లా పుట్ బాల్ టీమ్ కి జెర్సీలు బహూకరించిన జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్

           మదనపల్లి ( జనస్వరం ) : .డిసెంబర్ 5 నుంచి విశాఖ వేదికగా ఫుట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికైన క్రీడాకారులకు జనసేన పార్టీ నాయకులు డా. మైఫోర్స్ మహేష్  క్రీడాకారులు ఉపయోగించే దుస్తులు టీం జెర్సీలను బీటీ కాలేజ్ ఫుట్బాల్ గ్రౌండ్ నందు ఆటగాళ్లకు అందజేశారు. ఈ సందర్భంగా డా. మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ మదనపల్లి నుంచి క్రీడలైతే క్రికెట్ ఫుట్బాల్ లో భారతదేశానికి ప్రాతనిధ్యం రావాలని ప్రతి ఒక్క క్రీడాకారుడు కృషి చేయాలని అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. మైఫోర్స్ ఆధ్వర్యంలో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు ఫుట్బాల్ టోర్నమెంట్లు నిర్వహించిన, ప్రోత్సహించిన అది జాతీయ జట్టుకి మదనపల్లి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలని ఆశతోనే చేస్తున్న బాధ్యత గల కార్యక్రమాన్ని తెలియజేశారు. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైఫోర్ సంస్థ ద్వారా తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గిరి రావు, చిత్తూరు జిల్లా ఫుట్బాల్ టీం సభ్యులు మహేంద్ర గౌడ్, ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook