పార్వతీపురం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో టీమ్ పిడికిలి పోస్టర్ CBI దత్తపుత్రుడుకి జనసేన సవాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఆటోకి అతికించి అంతరరం ఆటోలో ఉన్న ప్రయాణీకులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలు చేసుకున్న మూడు వేల మంది కౌలురైతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు చెప్పున తన సొంత డబ్బును పంచుతున్నారు. అన్నపెట్టె రైతన్నను ఆదుకుంటున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు వివరించి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స.పుండరీకం, వజ్రగడ్డ రవికుమార్(జాని), బి.పి. నాయుడు, వాన మహేష్, కంటు మురళి, సాధు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com