Search
Close this search box.
Search
Close this search box.

తాళ్లపూడి గ్రామంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన నాయకులు

   తాళ్లపూడి, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామంలో జనసైనికుల శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జనసేన నాయకులు ప్రారంభించారు. తాళ్లపూడి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏది అయినా ప్రమాదంలో మరణించినట్లైతే 5లక్షలు పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. అధిక సంఖ్యలో జనసేన సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. మండలంలో ప్రతి గ్రామంలో నమోదు కార్యక్రమం ఇలాగే జరగాలి అని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోతుల దుర్గాప్రసాద్, ఉప్పులూరి భద్రం, కొనగల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way