పిట్టపాలెం గ్రామ ఉపాధి కూలీలతో జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

     ఎచ్చెర్ల, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు ఈరోజు శుక్రవారం నాడు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పిట్టపాలేం గ్రామ చెరువులో పవన్ రావాలి పాలనా మారాలి అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం తప్పిదాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంతవరకు ఉపాధి కూలీల నగదు ఎకౌంటులో జమ కాలేదు మేము ఎలా బ్రతకగలము అని ప్రజలు వాపోయారు. పిట్టపాలెం గ్రామ ప్రజలకు ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని అలాగే జనసేనపార్టీ సిద్దాంతాలను, మేనిఫెస్టో గురించి చెబుతూ ఈసారి జనసేన పార్టీని గెలిపిస్తే గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, తెల్లరేషన్ కార్డుకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లో రూ”2500-3500/-వరకు నగదు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదర్శాలను, ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించడం జరిగింది. టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని కరిమజ్జి.మల్లీశ్వారావు, పోట్నూరు.లక్ష్మునాయుడు కోరడమైనది. ఈ కార్యక్రమంలో పిట్టపాలేం గ్రామ పెద్దలు, మహిళలు, జనసైనుకులు పంపురెడ్డి ఆదినారాయణ, వినయ్, కెల్లా.భాషా, పిట్ట.గంగులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way