కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన నాయకులు

       విజయవాడ ( జనస్వరం ) ; విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఘాట్ రోడ్డు కొండ చెరియలు జారిపడిన ప్రాంతాన్ని మరియు కేశఖండనశాలను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నగర కార్యదర్శి కొరగంజి. వెంకటరమణ ,నగర అధికార ప్రతినిధి ముద్దాన .స్టాలిన్ మరియు నాయకులు చిప్పల. కృష్ణ గారితో కలిసి సందర్శించారు. అదృష్టం బాగుండి ఎటువంటి నష్టం జరగలేదు. ఆలయ ఈవో, అధికారులు & పాలకమండలి తక్షణమే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్డు పై కొండ చెరియలు జారి పడకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలి. శ్రావణమాసంలో అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది,ఆలోపే ఘాట్ రోడ్డుపై రాకపోకలను పునరుద్దించాలి. వేలాది మంది భక్తులు వచ్చి ఎంతో పవిత్రంగా అమ్మవారికి తలనీలాలు సమర్పించే కేశఖండనశాలలో వసతులు అధ్వానం. దుర్గా ఘాట్ లో పవిత్ర స్నానం ఆచరించేందుకు అవకాశం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way