Search
Close this search box.
Search
Close this search box.

వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయాలని R&B అధికారులకు వినతిపత్రం ఇచ్చిన పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు

    సామర్లకోట, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట పట్టణంలో, సామర్లకోట నుండి పిఠాపురం వెళ్లే  రహదారి వంతెన కూలిపోయి కొన్ని నెలలు అవుతున్న, నిర్మాణ పనులు నత్తనడకన జరుపుతూ కాలయాపన చేస్తున్నారని వంతెన ప్రక్కన నిర్మించిన నడక మార్గం కూడా వర్షాలు కారణంగా కొట్టుకొని పోయినది. సదరు మార్గం కూడా లేక అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. వెంటనే మట్టి మార్గం బాగు చెయ్యాలని సామర్లకోట మున్సిపాల్‌ కమీషన్‌ గారికి మరియు R&B అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో   జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల బాబు గారు, జిల్లా కార్యదీర్ములు పిట్టా జానకి రామారావు గారు, రాజన్న గారు,టౌన్‌ ప్రెసిడెంట్‌ సరోజ వాసుగారు, తుమ్మల ప్రసాద్‌ గారు, మోటూరి నగేష్‌ గారు, నాగబాబు గారు, గణేష్‌ నున్నా గారు మరియు సామర్లకోట పట్టణ జనసేన వీరమహిళలు శ్రీమతి పెంకే వెంకట లక్ష్మీ గారు, చోడే ఇందిరా గారు, రాయుడు శ్రీదేవి గారు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way