Search
Close this search box.
Search
Close this search box.

హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న జనసేన నాయకులు

     ములకలచేరువు, (జనస్వరం) : మన సనాతన హిందూ ధర్మాలను జానపద గేయ భజనల రూపంలో తరువాతి తరం వాళ్లకు అందిస్తూ ఎన్నో భజన బృందాలను ఏర్పాటు చేసి, తిరుమల కొండ మీద భజనలు చేయిస్తున్నది మన జానపద కళాకారుల సంఘం. అన్నమాచార్యుల వారి వారసులు ఈ సంఘంలోని కళాకారులని సన్మానించే కార్యక్రమం మండల వారిగా చేపడుతున్నారు. పెద్దపాళ్యం ఆంజనేయస్వామి ఆలయంలో సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ములకలచేరువు మండల భజన బృందాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ ధర్మానికి మన వంతు సహాయం చేయడానికి, పెద్దపాళ్యం కామాక్షి అంజి గారి ఆలోచనతో, ములకలచేరువు మండల జనసేన అధ్యక్షులు సాయినాథ్ గారి ఆధ్వర్యంలో భజన బృందాలకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన ప్రధాన కార్యదర్శులు కిరణ్ రాయపు, సుదర్శన్, సురేష్, శ్రీధర్, నరేష్, అమర, రామాంజులు, సుబ్బరామ్, ప్రభాకర్ నాగరాజు, జనసేన కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way