Search
Close this search box.
Search
Close this search box.

తెర్లం, పినపింకీ రోడ్డును మరమ్మత్తు చేయాలని జనసేన నాయకుల డిమాండ్

తెర్లం

        బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గం, బొబ్బిలి నుంచి తెర్లం వెళ్లే రోడ్డు, పినపింకీ నుంచి ఆకులకట్ట రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో, రోడ్లును బాగుచేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ బొబ్బిలి మండలం పారాది బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితిలో ఉండడంతో అన్ని వాహనాలతో పాటు భారీ వాహనాలను కూడా ఆకులకట్ట రోడ్డు గుండా తెర్లాం రోడ్డుకు దారి మల్లించడంతో ఇదివరకు అక్కడక్కడ గుంతలతో వున్న రోడ్డు, ఇపుడు భారీ గుంతలు గోతులో అద్వాన్న స్థితి ఏర్పడడంతో, ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన గుంతలకు నాణ్యతతో కూడిన మరమ్మత్తులు చేయాలని, కారాడ గ్రామంలో ప్రతి సంవత్సరం రోడ్లు కుంగిపోతున్నాయని అన్నారు. పదవులు అనుభవిస్తున్న అధికార పార్టీ నాయకులు, బాధ్యత తీసుకొని సీసీ రోడ్డు వేసి శాస్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, తెర్లం మండల అధ్యక్షలు మరడాన రవి, సీనియర్ నాయకులు పొట్నూరు జనార్ధన, గేదెల శివ, ఎందువా సత్యన్నారాయణ, పళ్లెం రాజా, అలజంగి కారాడ జనసైనికులు, కారాడ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way