టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జనసేన నాయకుల డిమాండ్

టమోటా

     పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నందు టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా చేయడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గం నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, మధ్యాహ్నం మూడున్నర గంటలకు మార్కెట్ కి వెళ్లి, టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయని మొదట రైతులతో మాట్లాడడం జరిగిందన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ ముందు బైపాస్ రోడ్డు నందు టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ప్రభుత్వమే టమోటాలను కొనాలని చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ బైపాస్ రోడ్డు నందు ధర్నా చేశారు. మార్కెట్ యార్డ్ కి సంబంధించిన అధికారులు వారి దగ్గరకు వచ్చి, మంగళవారం నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. ఒకవేళ మంగళవారం లోపల ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే, బుధవారం రోజున రైతులకు గిట్టబాట్ట ధర కల్పించేంతవరకు దీక్ష చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వడ్డే విరేష్, అజయ్, ఆర్కే నాయుడు, నాగరాజ్, రంగస్వామి, ఎర్రి స్వామి, విజయ్ కుమార్, నాగరాజ్, అభిరామ్, రమేష్, ఇస్మాయిల్ తిమ్మ, బిజెపి మండల నాయకులు, శంకరయ్య, మరియు సిసి రంగన్న, రామాంజనేయులు, గోరంట్ల, నరేష్, చంద్ర, సోమన్న,  తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way