Search
Close this search box.
Search
Close this search box.

డ్రైనేజీ ఎత్తు పెంచాలని జనసేన నాయకుల డిమాండ్

జనసేన

       పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ పత్తికొండలో అభివృద్ధి పేరుతో అంబేద్కర్ సర్కిల్ నుండి పాత ఊరు వాకిలి వరకు, మెయిన్ రోడ్డుకు, ఇరువైపులా కాలువలు నియమించాలని చెప్పి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధికారులపై ఒత్తిడి చేసాం, మాతోపాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఈ సమస్యపై పోరాటం చేశారు, అందరి ప్రయత్నం వల్లే ఈరోజు కాలువ నిర్మాణం చేపట్టారు, కానీ ఎత్తు 4 అడుగులు, వెడల్పు 2 అడుగులతో నిర్మాణం చేపడుతున్నారు, విషయంపై ఆర్ అండ్ బి ఏఈ మేడం గారితో మాట్లాడడం కూడా జరిగింది మేడం గారు ఇంత చిన్న డ్రైనేజీ కాలవలు నిర్మించడం వల్ల చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి నీరు వస్తాయి కావున డ్రైనేజీ కాలువలు వెడల్పు పెంచాలని, ఈరోజు అడగడం జరిగింది, ఏఈ గారు సమాధానం మాకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారమే మేము కాలవను నియమిస్తున్నాం అన్నారు, అలా నియమిస్తే చిన్నపాటి వర్షానికి రోడ్లు పైకి నీరు వస్తాయి, మేడం గారు ఎలాగైనా కాలవను వెడల్పు చేయాలని తెలియజేశాం అలా అలా కుదరదు మాకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారమే మేము కాలవను నియమిస్తున్నాం ఎందుకంటే పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీకి డిఫరెంట్ గా ఉంటాయండి మన పత్తికొండ గ్రామపంచాయతీ కావున మేము ఏమి చేయలేం అంటున్నారు, ఇక్కడ సమస్య ఏంటంటే, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఈ విషయంలో మేము వ్యతిరేకిస్తున్న విషయం ఏమిటంటే పత్తికొండలో దాదాపు 40000 జనాభా నివసిస్తున్నారు, ఈ జనాభాకు ఇలా చిన్నపాటి డ్రైనేజీ కాలువలు సరిపోవు, పత్తికొండలో నివసిస్తున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ కాలవలు వెడల్పు ఎత్తు పెంచాలని మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు నియమిస్తున్న డ్రైనేజీ కాలవలు ఎత్తు వెడల్పు పెంచాలని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way