పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని జనసేన నాయకుల డిమాండ్

       కళ్యాణదుర్గం ( జనస్వరం ) : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వర్షానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో మొక్కజొన్న, అరటి తోట పండిస్తున్న రైతులకు భారీ నష్టం వాటిల్లిందని జనసేన నాయకులు తెలిపారు. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలియజేశారు. కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం అరటి పంట రైతులకు తక్షణమే 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరి,మొక్కజొన్న రైతులకు 50 వేల రూపాయలు, మామిడి పంట రైతులకు తగిన మొత్తంలో పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం… అలాగే మిర్చి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది ఇప్పటికే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారన్నారు. పంట నష్ట గణాంకాలను వర్గాలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని వ్యవసాయ సంబంధిత అధికారులను కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, జనసేన నాయకులు జాకీర్ హుస్సేన్, ఉదయ్, తిమ్మరాజు, మరంపల్లి, అనిల్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way