ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను తెలియజేయాలని జనసేన నాయకుల పిలుపు

జనసేన

            జి.మాడుగుల ( జనస్వరం ) : జనసేనపార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశమైన జనసేనపార్టీ నాయకులు. ఈ సందర్బంగా కార్యనిర్వహన కమిటీ అధ్యక్షులు తాంగుల రమేష్, మండల ప్రధాన నాయకులు మసాడి సింహాచలం మాట్లాడుతూ త్వరలోనే గ్రామస్థాయి పర్యటనలో భాగంగా పంచాయితీ ఎంపికలు ఉంటుందని అన్నారు. ముందుగా పర్యటన చేసే పంచాయతీలో స్థానిక జనసైనికులకు, వీరమహిళలకు సమాచారాన్ని చేరవేస్తామని అందుకు తగిన ఏర్పాట్లతో మన పంచాయితి సమస్యలు మన బాధ్యత అనే అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన ఉంటుందని తెలియజేసారు. అలాగే గౌరవ అధ్యక్షులు తెయ్యవడా వెంకట రమణ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ విధి విధానాలు ఆదివాసీలకు తెలియజేస్తూ ప్రస్తుత ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను తెలియజేయ్యాల్సిన బాధ్యత ముఖ్యంగా యువత తీసుకోవాలని అన్నారు. మండల బూత్ కన్వీనర్ భానుప్రసాద్ కొర్ర మాట్లాడుతూ ఇప్పటికే పలు పంచాయతీల వారిగా కొత్తగా యువ ఓటర్లు నమోదు ప్రక్రియ చేశామని పంచాయితి స్థాయిలో నాయకత్వం చెయ్యడానికి సరికొత్త రాజకీయ విధానాలు జనసేనపార్టీ సిద్ధాంతాలు ఆచరించే కొత్త నాయకత్వానికి ఆదివాసీ ప్రజలు సిద్ధపడాలన్నారు. ఈ సమావేశంలో మండల నాయకులు మసాడి సింహాచలం, కార్యనిర్వహన కమిటీ సభ్యులు తాంగుల రమేష్, గౌరవ అధ్యక్షులు తెరావాడ వెంకటరమణ, మండల బూత్ కన్వీనర్ కొర్ర భానుప్రసాద్, నాగేశ్వరరావు, సోమన్న, చందు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way