స్వంత నిధులతో నీటి పైపు లైన్లకు మరమ్మత్తులు అందించిన జనసేన నాయకుడు పొట్నూరు లక్ష్మి నాయుడు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్ధలం మండలంలో కృష్ణాపురం గ్రామంలో తాగునీటి సరఫరా పైపు లైను లీక్ అవడంతో ఇటు ప్రభుత్వం గాని, ఇటు నాయకులు గాని పట్టించుకోలేదు. ప్రజలు పది రోజులు నీరుకోసం ఇబ్బందులు పడుతుంటే జనసేనపార్టీ నాయుకులైన జనసేన యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, నడుపూరు శంకర్రావు రంగంలోకి దిగి తమ స్వంత నిధులతో పైపులు కొని పైపులైను బాగుచేసి ప్రజలకు నీరునీ అందించారు. ప్రజలకు సేవచేయాలనే దృక్పథంతో ప్రజలకు నేరుగా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో నీరు అందించాము అని అన్నారు. జనసేన కార్యకర్తలు జనసైనుకులు తదితరులు పాల్గొన్నారు.