Search
Close this search box.
Search
Close this search box.

నరసాపురం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

    నరసాపురం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గ పొందూరు మండలం నరసాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు  హుటాహుటిన బయలుదేరి స్థానిక కార్యకర్తలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే అధికార ప్రభుత్వం ఇళ్లను అనర్హులకు కేటాయించి, ఇటువంటి అర్హులైన పేద వారిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం జనసేన పార్టీ తరుపున తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులను అందచేసి, భవిష్యత్తులో అన్ని రకాలుగా సహాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావుతో పాటు స్థానిక నాయకులు, చిన్నం నాయుడు, రమణ, బాబురావు, సురేష్, శివ, లక్ష్మణ్, వసంత్, హరి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way