Logo
Date of Publish : 02 February 2022, 1:31 pm
Editor : Sake Naresh

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

     శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని వరి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరపున ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు రైతులుతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడంతో, ఆ ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం లేక అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలే శరణ్యంగా యోచనలో ఉన్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకటరమణ, అప్పలనాయుడు, రామారావు, నాయుడు, సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి.మురళీ మోహన్ మండల నాయకులు ధనుంజయ్, వాసు, నాగరాజు, రమణ, శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com