జనసేన నాయకుడు, కాపు సంక్షేమ సేన గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రూ. 35000 వితరణ

                కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంలోని కాపు సామాజికవర్గానికి చెందిన బి. అద్దంకి విశ్వనాథ్ అనే వ్యక్తికి గల్ఫ్ కాపు సంక్షేమ సేన తరుపున 35,000/- ఆర్దిక సహయం చేశారు. విశ్వనాధ్ మరియు వారి కుటుంబ సభ్యులలోని వారి అమ్మ వారి అక్క అంతుపట్టని వ్యాధితో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకున్న గల్ఫ్ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు కాంచన శ్రీకాంత్ గారు వారి బృందం సహకారంతో 35 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమం కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, తిరుపతి కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఎస్సై కృష్ణయ్య, అధ్యక్షులు ఆనంద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ దడియాల మధు గార్ల చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విలువలు ఉన్నత ఆశయాల కోసం కాపుల ఐక్యతే లక్ష్యంగా పెద్దలు శ్రీ హరి రామ జోగయ్య గారు స్థాపించినటువంటి కాపు సంక్షేమ సేన గల్ఫ్ దేశాల అధ్యక్షుడిగా కంచన శ్రీకాంత్ గారు రాయలసీమలోనే మొట్టమొదటి కార్యక్రమంగా అద్దంకి విశ్వనాధ్ కుటుంబానికి అండగా నిలబడి 35 వేల రూపాయలు ఆర్థిక సహాయం వైద్య ఖర్చులకు అందజేయడం చాలా సంతోషం అని అన్నారు .  వారి కుటుంబానికి అండగా ఉంటామని వారికి ఉన్న వ్యాధి ఏమిటో కనుక్కొని ఆ వ్యాధి నయం అయ్యే విధంగా వైద్య సేవలు కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలు కుప్పాల జ్యోతి, మధు, కమలాపురం జనసేన నాయకులు రామ్ సిద్దు, అతికారి నాగేంద్ర, పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమానికి ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించిన పత్తి సుబ్బారాయుడు గారికి, హర్ష గారికి, పగడాల అంజన్ కుమార్ గారికి, రామ చంద్ర నాయక్ గారికి, దండు శేఖర్ గారికి, మాదాసు నరసింహులు గారికి, జగిలి ఓబులేసు గారికి, గుంటూరు శంకర్ గారికి, భాస్కర్ గారికి, దుర్గం మోహన్ గారికి, కొత్తపల్లి శ్రీను గారికి,షైక్ అయూబ్ గారికి,రెడ్డి చెర్ల ఆంజనేయులు గారికి, చీర్ల మల్లికార్జున్ గారికి, నరసింహ రాయల్ గారికి(కతర్), పెద్ద బలిజ పల్లి రాజా గారికి, కొమ్మినేని బాలాజీ గారికి, అల్లం ప్రేమ్ రాయల్ గారికి, కోలా మురళి గారికి, ఆకుల సుమన్ గారికి, పసుపులేటి రాజేష్ గారికి, బుర్రా శంకర్ గారికి, శ్రీహరి ప్రేమ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.