మైనార్టీల అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది : డాక్టర్ కందుల నాగరాజు

   విశాఖపట్నం ( జనస్వరం ) : మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలోని పలువురు ముస్లిం మహిళలు ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూముస్లింల సంక్షేమానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు కమ్యూనిటీ భవనాలు, షాదీఖానలు నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం ముస్లింలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే తెలిపారు. అధికారంలోకి వచ్చాక మైనారిటీ ల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను వైసిపి మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా అదికార మార్పిడి జరుగుతుందన్నారు. మైనారిటీ ల సమస్యలను పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way