అమరావతికే జనసేన కట్టుబడి ఉంది : రైతుల సభలో చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

    తిరుపతి, (జనస్వరం) : తిరుపతిలో నిర్వహించిన అమరావతి రైతుల మహాసభలో జనసేన పార్టీ నాయకులు పిఏసి సభ్యులు డా పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే మాటకు ఆరోజు కట్టుబడి ఉన్నారు. ఈరోజు కట్టుబడి ఉన్నారు. ఆయన రైతుల పక్షపాతి, గత ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాకుంటున్న సమయంలో రైతులు ఇస్తే తీసుకోవాలే తప్ప బలవంతపు చర్యలకు పాల్పడవద్దు అని ఆరోజు తీవ్రంగా ఖండించారు. అదే విధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలను రైతులను మూడు రాజధానులు అంటూ మోసం చేస్తున్నారు అని దీనికి పవన్ కళ్యాణ్ కల్యాణ్ గారు పూర్తి వ్యతిరేకమని అమరావతి రైతులకు మద్దతుగా ఈ రోజు మేము హాజరయ్యాము అని, అమరావతే రాజధానిగా ఉంటుందని జనసేన పార్టీ తరపున మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చి జనసేన తరపున మా పూర్తి మద్దతు తెలియజేయడం జరిగిందని అన్నారు. రాందాస్ చౌదరి మాట్లాడుతూ అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సందేశము పంపారని జనసేన ప్రతినిధిగా మేము హాజరయ్యమని, అమరావతే రాజధానిగా ఉంటుందని అన్నారు. రైతుల పక్షాన జనసేన పార్టీ ఉంటుందని స్పష్టం చేసారు. రైతుల పాదయాత్ర జనం మదిలో నిలిచిపోతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way