Logo
Date of Publish : 05 February 2026, 6:28 pm
Editor : Sake Naresh

అహుడా చైర్మన్‌ టి.సి వరుణ్ ను కలిసిన గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ

గుంతకల్, ఫిబ్రవరి 6, (జనస్వరం) : అహుడా చైర్మన్ టి.సి వరుణ్‌ను జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అహుడా పరిధిలోని గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చ జరిపారు. ముఖ్యంగా పట్టణాలు, గ్రామాలు, పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన కోసం గతంలో ప్రతిపాదించిన పనులకు నిధులు కేటాయించాలని మణికంఠ కోరారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన అహుడా చైర్మన్ టి.సి వరుణ్ గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ భేటీ గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా మారనుందని జనసేన నేతలు పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com