“నిజం గెలవాలి” కి జనసేన సంపూర్ణ మద్దతు

నిజం గెలవాలి

– చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరం

– చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

           తిరుపతి ( జనస్వరం ) : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. మంగళవారం ఆయన నారావారిపల్లెలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. బుధవారం నుంచి భువనేశ్వరి చేపట్టనున్న “నిజం గెలవాలి” కార్యక్రమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. చంద్రబాబు చేయని తప్పుకు కేసులో ఇరికించారన్నారు. టిడిపి – జనసేనకు ప్రజల నుంచి మద్దతు ఉందని తెలిపారు. దేవుడితో పాటు ప్రకృతి కూడా టిడిపి-జనసేన కూటమికి అనుకూలంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీల సమన్వయంతో ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. జనసేన రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని నారా భువనేశ్వరికి తెలిపారు. జనసేన మద్దతుపై భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way