Search
Close this search box.
Search
Close this search box.

ఇంటింటికి జనసేన మాటలు : అరకు జనసేన నాయకులు సాయిబాబా, దురియా

     అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలంలో తేరు పంచాయతీ పరిధిలో గల తోటవలస గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ఆధ్వర్యంలో బుధవారము ఇంటింటికి జనసేన మాటలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గృహాన్ని, పాఠశాలని పరిశీలించడం జరిగినది. అనంతరం ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై సాయిబాబా మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ గృహానికి బిల్లులు మంజూరు చేయాలని, నేటి వరకు పాఠశాల నిర్మాణాలు పూర్తి చేయని వృత్తిదారుల పై ప్రభుత్వం విచారణ చేపట్టి వారిపై చర్య లు తీసుకోవాలని, గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులను పింఛన్ నిలిపివేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తూ ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయగలరని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని చెప్పారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీనాథ్ శ్యామ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way