జనసేనాని జన్మదిన సందర్భంగా మాడుగుల గ్రామంలో కిడ్నీ బాధితునికి 15 వేల రూపాయలను అందించిన జనసైనికులు
మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం, ఎమ్.కోడూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే సందర్భంగా ఇద్దరు కిడ్నీ పేషెంట్లకు రూ.15000 జనసైనికులు అందించడం జరిగింది. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గట్టా రామారావు, గొల్లవెల్లి వరహామూర్తి, చాణుక్య, గణేష్, శ్రీను, తరుణ్, రమేష్, జగన్నాధరావు తదితర జనసైనికులు పాల్గొని జనసేన అధినేత నిండునూరేళ్లు వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు.