అత్యాచార కేసుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరిన జనసేన వీర మహిళలు
మొన్న SP గారికి ఇచ్చిన వినతిపత్రాలు రిత్యా అది 2 టౌన్ కి ఫార్వర్డ్ చేసినందున పోలీస్ వారు కాకినాడ మాజీ మేయర్ , జనసేన పార్టీ రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ మెంబర్ శ్రీమతి సరోజ పొలసపల్లి గారికి ఒకసారి స్టేషన్ కి రావలసిందిగా పిలుపినిచ్చారు. వెళ్లిన వీరమహిళలు జయలక్ష్మి ముత్యాల, కృష్ణవేణి సుంకర, రమ్యజ్యోతి పిల్లా, జ్యోతి దాలే గార్లు అక్కడికి వెళ్లి ఇచ్చిన వినతిపత్రాలు విషయాలను అక్కడ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చిన్నారి గారి సమక్షంలో రైటర్ గారు రాసుకుని వారు అడిగిన వాటికి క్లుప్తంగా వివరించడం, వాటిని ఆన్-రికార్డ్ రాసుకున్నారు. తదుపరి కార్యాచరణ FIR నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. ఈ కేసును పరిష్కార దిశగా వేగవంతం చేయాలని కోరారు.