కర్నాటకలోని రాయచూర్ లో జనసేనాని జన్మదిన వేడుకలు, అన్నదానం, పూజా కార్యక్రమాలు
కర్నాటకలోని రాయచూర్ లో జనసేనాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఖ్యాత నటుడు శ్రీ పవన కళ్యాణ్ 49 వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు శ్రీ కనక దాస్ అనాథ పిల్లలు స్కూల్ లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. అలాగే పిల్లలకు మాస్కులు పంపిణీ చేశారు. జనసైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మాకు సినిమా పరంగా చాలా అభిమానిస్తామని, అలాగే పాతికేళ్ళ భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉందని, జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా మాకు నచ్చాయి అన్నారు. ఈ కార్యక్రమంలో బి. ఎం. విశాల్, తిరుమల రెడ్డి, వెంకీ, శీను, అఖిల్శి, గురు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.