ఆడబిడ్డల కోసం ఆత్మ గౌరవదీక్ష చేస్తున్న సందీప్ పంచకర్ల గారికి మద్దతుగా జనసేన భగత్ సింగ్ విద్యార్థుల విభాగం దీక్ష

               జనసేనపార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం కన్వీనర్ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల గారు మహిళలపై దాడులను ఖండిస్తూ
“ఆడబిడ్డల కోసం ఆత్మగౌరవ దీక్ష” చేపట్టారు. అయనకు మద్దతుగా జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు షరీఫ్  గారు పొన్నూరు నియోజకవర్గంలోని అయన స్వగృహం నందు నిరసన తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రలతో ఆయన మాట్లాడుతూ ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయలను ఖండిస్తూ ఈ ప్రభుత్వం ఏమి చేస్తున్నది? నిద్ర పోతుందా? అని ప్రశ్నించారు. దిక్కు లేని దిశా చట్టం తెచ్చి అది చేస్తున్నా౦. ఇంత మందికి శిక్ష వేసాం అంటున్నారు… అసలు అ చట్టం అమలు జరిగిదా ? చట్టం అయిందా? మీ భజన మీదే ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు అంటూ మండిపడ్డారు.  మా జనసేన పార్టీ అధినేత వస్తేనే మార్పు వస్తుంది, ఆడవాళ్లుకు రక్షణ వస్తుంది అన్నారు. టీడీపీ మరియు వైసీపీ పార్టీలు అన్యాయం జరిగిన ఆడవాళ్లకు న్యాయం చేయకపోగా శవ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీకి అంత చిత్త శుద్ధి ఉంటే సుగాలి ప్రీతి అన్యాయం ఎందుకు చేశారు? ఇప్పుడు మీరు వచ్చి రాజకీయం చేస్తారా అంటూ టీడీపీ, వైసీపీ పార్టీ పై మండిపడ్డారు.