పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల గురించి జనసేన మరియు బీజేపీ పార్టీల సమావేశం

                 పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల గురించి జనసేన మరియు బీజేపీ పార్టీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇంచార్జ్ కోలా ఆనంద్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ రామ చంద్రయ్య గారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలమనేరు జనసేన పార్టీ నాయకులు పూల చైతన్య, పలమనేరు బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి GR ప్రభాకర్ ఆధ్వర్యంలో పలమనేరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుందని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ, రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలను నిరసిస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లాలి అని కోలా ఆనంద్ గారు సూచించారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వలో ఆంధ్రప్రదేశ్ జనసేన & బీజేపీ అధికారంలో వస్తుంది ధీమా వ్యక్తం చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, రవికుమార్, అబ్బూరి తాతయ్య, ఉమా మహేష్, చెంచు రెడ్డి, నక్క రామచంద్రయ్య, శరవణ, గంగవరం జనసేన జడ్పిటిసి అభ్యర్థి మంజుల చంద్ర గారు, టైలర్ రాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, చందు, అనిల్, వెంకటరమణ , శివాజీ, షేరు, జనార్ధన్, విష్ణు ప్రసాద్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way