Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల సమస్యలు పరిష్కరించడం జనసేన కార్యకర్త లక్ష్యం : జనసేన నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు

జనసేన

  గూడూరు, (జనస్వరం) :   జనసేన పార్టీ సిద్ధాంతాలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి  ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో  జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం భీమా పథకంను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రమాదంలో గాయపడ్డ వారికి 50 వేలు, దురదృష్టవశాత్తు మృతి చెందితే వారి కుటుంబానికి 5 లక్షలు అందచేయడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలంతా పనిచేయాలని కోరారు. అనంతరం జిల్లా కార్యదర్శి అల్లం బాబు, నాయకులు పెద్దిశెట్టి కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ పార్టీ అభిమానులు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని, 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమురు మండలాల నాయకులు రాజశేఖర్, జమాల్ భాష, మనోజ్ కుమార్, విష్ణు, మోహన్, మణి, ఓంకార్, సాయి, శివ, శశి, వెంకటేష్, జనార్ధన్, తేజ, నాగమణి, గని, సుమంత్, పరశురాం తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way