చెల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జనసైనికుని జన్మదిన వేడుకలు

    చెల్లూరు, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో దివంగత జనసైనికుడు శ్రీ బండి రాంబాబు గారి జన్మదిన వేడుకలు జనసైనికులు, జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా పుట్టిన రోజు కేకును కట్ చేసి గ్రామంలో ఉన్న వృద్ద, ఒంటరి మహిళలకు వస్త్ర దానం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు మాట్లాడుతూ చెల్లూరు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నిబద్ధతతో నిస్వార్థంగా పనిచేసి పార్టీ పటిష్టకు అహర్నిశలు కృషి చేసిన కీర్తిశేషులు శ్రీ బండి రాంబాబు గారి సేవలు మరువలేమని, గ్రామంలో ఏ పార్టీ కార్యక్రమం చేసిన అది రాము గారు స్ఫూర్తితో చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు, MPTC-1 గొల్లపల్లి అనురాధ, పంచాయితీ 1వ వార్డ్ సభ్యులు గళ్ళా సావిత్రి, గరగ ధనలక్ష్మి, వల్లూరి సత్య ప్రసాద్,గొల్లపల్లి వెంకట రమణ, తలాటం వెంకటేష్ , కొండేపూడి ఆనంద్, సుంకర సంతోష్, కొండేపూడి అవినాష్, బండి వీరబాబు, నరేష్, మణికంఠ, రాజేష్, వర ప్రసాద్, కోడూరి సురేష్, మోటురి పండు, దేవు రాజా, ఏడా కుల దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way