జనసైనికులరా ఛలో కొత్తచెరువు-రండి తరలిరండి – శింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ

శింగనమల

శింగనమల, (జనస్వరం) :  అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు పట్టణంలో దెబ్బతిన్న రోడ్లపై శ్రమదానం చేసి నిరసన తెలపడానికి అక్టోబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విచేస్తున్నారని శింగనమల నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లపై నిరసన తెలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2 న పిలుపునిచ్చారు. రోడ్లు బాగు చేయని పక్షంలో అక్టోబర్ 2వ తేదీన శ్రమదానం చేస్తామని తెలిపారు. అందులో భాగంగా కొత్తచెరువుకి విచేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ సభకు శింగనమల నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శిలు B పురుషోత్తంరెడ్డి, జయమ్మ,  మన్నల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240125-WA0011
మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
IMG-20240108-WA0010
నెల్లూరు నగరంలో హోరెత్తిన జనసేన జెండా
నెల్లూరు
నెల్లూరు సిటీలో జనసేన జెండా ఆవిష్కరణ 
శింగనమల
శింగనమల నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకోని వైసిపి ఎమ్మెల్యే
Varahi Updates
Varahi Updates : How to improve 5 best Knowlwdge sites

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way