Search
Close this search box.
Search
Close this search box.

ఎస్.లింగాలవలసలో జనసేనకు జననీరాజనాలు

జనసేన

        గజపతినగరం ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు మంగళవారం గజపతి నగరం మండలం, ఎస్.లింగాల వలసలో గజపతినగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా ఇంటిఇంటికి జనసేన సిద్దాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ, జనసేన సిద్దాంతాలను ప్రజలకు తెలియజేస్తూ చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా, ఏఇంటికి వెళ్లినా జనసేనకు జననీరాజనాలు పలుకుతున్నారని, ముఖ్యంగా యువత నుండి, మహిళలు నుండి, మరియు వృద్ధులు నుండి జనసేనకు ఒక్కసారి అవకాశం ఇద్దాం, అన్ని పార్టీలను చూసాం ప్రజలకు చేసేందేమి లేదు అని ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలపై దుయ్యబట్టడం ప్రజల్లో వచ్చే మార్పుకు సంకేతమని అన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తామన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్, పండు, కుమిలి దాలి నాయుడు, కడమల శ్రీను, హరీష్ నాని, చలం, పెనుమజ్జి ఆదినారాయణ, పారాది గణేష్, పైల శ్రీను, కునుకు ఈశ్వరావు, మిర్తిపాటి సురేష్, సారికి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way