తాడిపత్రిలో టీడీపీ చేస్తున్న రిలే నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన జనసేన

తాడిపత్రి

             తాడిపత్రి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది.  తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి మరియు గన్నేవారిపల్లే పంచాయితీ మాజీ సర్పంచ్ చింబిలి వెంకట రమణ అధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలో తాడిపత్రి జనసేనపార్టీ మద్దతు తెలిపింది. జనసేన పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహా చారి మద్దతు తెలుపుతూ రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగింస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాబట్టి అందరూ అవినీతిపరులు అనే బురద జల్లి జైలుకి అందరినీ తనలానే జైల్ కు వెళ్ళాలని అనుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏ ఒక్క జనసైనికుడు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ కేసులకు భయపడరు అని విమర్శించారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోతుందని భయంతో కలవకుండా ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి ఎత్తులను చిత్తు చేసే విధంగా అద్భుతమైన వ్యూహంతో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. వైసీపీ ఇంటికి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల అధ్యక్షులు కోడి సునీల్ కుమార్, పేద వాడుగుర్ మండల అధ్యక్షులు దూద్ వలి, మరియు నాయకులు కిరణ్, గోపాల్, ఇమామ్, రబ్బానీ అయుబ్, శివకుమార్ రెడ్డి, అమీర్, పవన్ కళ్యాణ్, మని, కొండ శివ, హేమంత్ కుమార్, వెంకటేష్, మధు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way