Search
Close this search box.
Search
Close this search box.

మద్దికెరలో సాయినగర్ లో జనసేన ప్రజా పోరాట యాత్ర

    పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ మద్దికేర మండలం నాయకులు, గద్దల రాజు, సోంపల్లి అశోక్ కుమార్, మనోజ్ కుమార్, వడ్ల నరేష్, గద్దల అజయ్, ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజా పోరాట యాత్ర లో భాగంగా పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ గారు మద్దికేర గ్రామంలోని సాయి నగర్ కాలనీని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి నగర్ కాలనీకి సంబంధించిన ప్రజా సమస్యలను మౌలిక సదుపాయాల పనితీరును త్రాగునీరు మరియు గృహపకరణాల అవసరానికి ఉపయోగించే నీరు సదుపాయాలు మరియు కాలనీ రోడ్ల దుస్థితిని పారిశుభ్ర కాలువల గురించి కాలనీ వాసుని అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలనీవాసులు మాట్లాడుతూ సాయి నగర్ కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు పైబడిన ఇప్పటివరకు పంచాయతీ ద్వారా ప్రధాన నీటిపారుదల సౌకర్యాన్ని పైప్ లైన్లను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని మరియు కాలనీల మధ్య ఉండే రోడ్లను ఇప్పటివరకు సిసి రోడ్లుగా మార్చలేదని సిసి రోడ్లు లేకపోవడంతో గృహాల నుండి వచ్చే వ్యర్థ పదార్థాల నీరు రోడ్లు పైకి నిలిచిన దృశ్యాలు చూసాము. కాలువలు నిర్మించలేదని వివరించడం జరిగింది. ప్రధానంగా సాయి నగర్ కాలనీ మొత్తానికి సంబంధించి కేవలం మూడు వీధి ట్యాంకుల ద్వారా దాదాపు 400 ఇల్లలకు నీరు అందించే విధానం సరిపోవడం లేదని మరియు ఆ బోర్ల నుంచి వచ్చే నీరులో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుందని కాలనీవాసులు వివరించడం జరిగింది. మద్దికేర మండలంలోని సాయి నగర్ కాలనీకి సంబంధించినటువంటి గృహాల్లో దాదాపు 30% గృహాల్లో బాడుగలకు ఉన్నటువంటి కుటుంబాలకు జగనన్న కేటాయించినటువంటి జగనన్న కాలనీలో ఎటువంటి స్థలాలు కానీ, ప్రధానమంత్రి వికాస్ యోజన కింద ఇచ్చేటువంటి గృహకల్పన సంబంధించినటువంటి పథకాలు అందలేదని కాలనీవాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు గద్దల రాజు, అజయ్ కుమార్ ఎంపీటీసీ. వడ్డే విరేష్మ, నోజ్ కుమార్,  వడ్ల నరేష్ .అశోక్ కుమార్ .ప్రభాకర్ యాదవ్, లింగరాజు, విరేష్, అంజి, శ్రీకాంత్, ఖాసే, వంశీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way