వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వని అవ్వకు జనసేనపార్టీ పెన్షన్ ఇస్తుంది : కర్నూలు జనసేన నాయకులు

కర్నూలు

          కర్నూలు ( జనస్వరం ) : కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని P.సువర్ణమ్మ(70) కు  పెన్షన్ కి అన్ని అర్హతలు ఉన్నా కూడా పింఛను రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక జనసేన నాయకులు బాలు చొరవ తీసుకుని పెన్షన్ అందించేందుకు ఆన్ని ఆఫీసుల, అధికారుల దగ్గరకు, బడా రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళినా ఫలితం లేకపోయింది. బాలు ఈ సమస్యను పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి చింతా సురేష్ బాబు దగ్గరకు తీసుకొని వెళ్ళగా జనసేన పార్టీ తరపున ప్రభుత్వం నుంచి మీకు పింఛను వచ్చే వరకు మేము అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ. 2500, ముఖ్యమంత్రి తీసుకుంటున్న 1రూ జీతం కూడా కలిపి రూ 2501/- పింఛను అందిస్తామని ఆన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాణ్యం నియోజకవర్గంలో మొదటి పింఛను మీ నుంచే మొదలు అవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి తెలుగు రాజు, జనసేన నాయకులు మంజునాథ్, బజారి, రాంబాబు, షబ్బీర్, కృష్ణ బాబు, నగేష్, శివ, చైతన్య, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way