Search
Close this search box.
Search
Close this search box.

సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జనసేనపార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం సమావేశం

    నరసరావుపేట, (జనస్వరం) : జనసేనపార్టీ నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నర్సాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కాలేజీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేనపార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజలలో తీసుకెళ్లడానికి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు గురించి చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఒత్తిడి పెంచి వాటిని పరిష్కరించే విధంగా కార్యచరణ రూపొందిస్తామని తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేనపార్టీ నేతృత్వంలో సయ్యద్ జలాని ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై నరసరావుపేట నియోజకవర్గ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిరియాల సోమశంకర్, నాగ్, భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ నాయకులు, వేములయ్య, సాయి, పుల్లారావు, శ్యామ్, మహిమ, మని, ఆనంద్ తదితరులు  పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way