Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు

జనసేన

          పూతలపట్టు ( జనస్వరం ) : ఐరాల మండలం, ఎగువ నాంపల్లిలో నివసిస్తున్న ఎం.అనూష అనే 18 ఏళ్ల బాలికకు ఎవరికి రానటువంటి శ్వాసకోశ వ్యాధితో గత రెండు సంవత్సరాలుగా బాధపడుతుంది. అనూష తల్లిదండ్రులు కూతురుని బతికించుకోవడం కోసం ఉన్న ఆస్తులను, పశువులను అమ్మి ఆసుపత్రులు చుట్టూ తిరిగిన తగిన వైద్యం చేయించలేకపోయారు. ప్రభుత్వ అధికారులకు, స్థానిక రూలింగ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను సంప్రదించిన ఎటువంటి ఉపయోగం లేకపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించి తగిన సహాయం చేయగలమని హామీ ఇచ్చారు. ఐరాల మండలం మరియు పాకాల మండల జనసైనికులు సంయుక్తంగా కలిసి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరపున, DMC హెల్పింగ్ హాండ్స్ తరపున వారికి సుమారు 50,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమాన్ని వాసు రాయల్ మరియు రహమతుల్లా అందరితో మాట్లాడి సహాయం అందేలాగా చేశారు. అనూష తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారికి వారి ఆశయాలను నడిపించే జనసైనికులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసీర్, ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు శ్రీను, దినేష్ ప్రధాన కార్యదర్శులు వాసు, తులసి, రహమతుల్లా మండల కార్యదర్శి షాజహాన్, హరి శ్రీహరి సీనియర్ నాయకులు కిషోర్, మోహన్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way