Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ నాయకులను ప్రజలే చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించిన జనసేన నాయకులు

వైసీపీ

         అనంతపురం ( జనస్వరం ) : నేటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ప్యాకేజీ తీసుకున్నారు అన్న, మూడు పెళ్లిళ్లు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం చెప్పు మాత్రమే చూపించి కొడకల్లారా అని మాట్లాడారు. అధికార మదమెక్కి నోరు అద్దు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడారంటే మేము చెప్పు తీసుకొని కొడతామని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు మంత్రి ఉషశ్రీ, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, మాజీ మంత్రులు కన్నబాబు, పేర్ని నేని, నోరు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్న తదితర వైఎస్ఆర్సిపి మంత్రులు ఎమ్మెల్యేలు మీకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు, మీకు చాతనైతే దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నాడని నిరూపించి మీ మగతనం నిరూపించుకోండి లేదంటే నోరు మూసుకొని ఉండండన్నారు. మీకు చాతనైతే ఇంకా ఒకటిన్నర సంవత్సరం టైం ఉంది అభివృద్ధి చేసి చూపించండి, మూడు రాజధానులు నిర్మించి చూపించండి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని వట్టి మాటలు మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way