సాక్షి దినపత్రికను మంటగలిపిన జనసేన నాయకులు

సాక్షి

       అనంతపురం ( జనస్వరం ) : పత్రికా విలువలు పాటించకుండా జనసేన నాయకులు నాగబాబు గారి మాటలను వక్రీకరిస్తూ తప్పుడు కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోమని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు.  సాక్షి దినపత్రికలో… టిడిపి నాయకులు మన కింద పని చేయాలి! జనసేన టిడిపి శ్రేణుల మధ్యన పొసగని పొత్తు!! పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య సయోధ్య కుదరలేదు? మాకు సీఎం పదవి అవసరం లేదు? ఇలాంటి తప్పుడు రాతలు రాసి జనసేన టిడిపి శ్రేణులు మధ్యన అయోమయాన్ని సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ శ్రేణులకు ఇదే మా హెచ్చరిక అన్నారు. జనసేన టిడిపి పొత్తుని రెండు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి మరియు బాలకృష్ణ అభిమానులు అందరం కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జనసేన-టిడిపి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామని అన్నారు. జనసేన టిడిపి పొత్తుని ఓర్చుకోలేక అక్కస్సుతో వైసిపి వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీకు చాతనైతే మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసి వచ్చే ఎన్నికల్లో గెలవండి? జనసేన-టిడిపి పొత్తు గురించి ఓర్చుకోలేక అక్కసు వెళ్లగక్కితే మీకు ఉపయోగం లేదు అని తెలుసుకోండని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way