స్థానిక సమస్యలపై డా.ఎన్టీటీపీఎస్ సిఈ ని కలిసి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు

జనసేన

           మైలవరం ( జనస్వరం ) : కొండపల్లి మున్సిపాలిటీ మరియు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల సమస్యలపై జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల గాంధీ ఆధ్వర్యంలో డా.ఎన్టీటీపీఎస్ సిఈ అశోక్ కుమార్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ  కాలుష్య సమస్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై డా.ఎన్టీటీపీఎస్ బాధ్యతను గుర్తుచేస్తూ వినతి పత్రం అందించామన్నారు. మున్సిపాలిటీ మరియు మండలానికి రావాల్సిన CSR గ్రాంట్స్ విడుదల కొరకు, తుమ్మలపాలెంలో కాలువపై నిర్మించాల్సిన వంతెన కొరకు, బూడిద అక్రమ రవాణాని అరికట్టాలని, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, గ్రామాల్లో విదిగా మొక్కలు పెంపకం మరియు వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీమతి చింతలలక్ష్మీ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు మరియు ఎంపీటీసీ పోలిశెట్టి తేజ, యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, సామల సుజాత, సామల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way