రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యాత్ర చేపట్టిన వికలాంగుడైన ప్రసాద్ గారికి జనసేన నాయకులు సన్మానం

ప్రత్యేక హోదా

  అనంతపురం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రం చాలా నష్టపోయింది, ఇస్తానన్న ప్రత్యేక హోదా ప్రజలకి అభివృద్ధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విశాఖపట్నం రైల్వే జోన్ ను సాధించుకోవాలి అంటూ వికలాంగుడైన ప్రసాద్ గారు ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు మూడు చక్రాల సైకిల్ యాత్ర చేపట్టి సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ సత్య సాయి జిల్లా ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రసాద్ గారు వికలాంగులైన కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో తపన పడుతుండడం చూసి జనసేన నాయకులు అంతా కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్, నల్లమడ మండలం అధ్యక్షుడు బడిసం మహేష్, బుక్కపట్నం మండల అధ్యక్షుడు జయరాం, ముత్యాల కరుణాకర్, మారుతి, వెంకటేష్ నాయక్, తిరుపతేంద్ర, మేడాపురం స, చంద్ర, నవీన్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way