పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన నాయకుల డిమాండ్ 

      నూజివీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో అకాల వర్షంతో దాదాపు గ్రామంలో 250 ఎకరాలు పంట నీట మునిగి గింజ మొలకలు రావడంతో పంట నష్ట పోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు గారు పంట పొలాలను పరిశీలించి,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ ఒక వైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయి కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టంలో పూర్తిగా రైతులు దాదాపు ఎకరాకు 30 వేల మేర నష్టపోయారని కనీసం వర్షాలు వచ్చి వారమైన నేటికీ అధికారులు వచ్చి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై బర్మా ఫణి బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి వెంటనే రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు ఆయనతో పాటు చెక్కపల్లి గ్రామ రైతులు జనసేన నాయకులు పాశం నాగబాబు, తోట సత్యం, శ్రీధర్, మారుతి, రవి, శ్రీను, సతీష్, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, సురిసెట్టీ శివ, గొల్లపల్లి శ్రీకాంత్, కడియం సత్యనారాయణ, శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way