Search
Close this search box.
Search
Close this search box.

చిన్న బురాడ పేట గ్రామంలో చెరువు గండిని పూడ్చడానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకురాలు లోకం మాధవి

లోకం మాధవి

          నెల్లిమర్ల ( జనస్వరం ) : శ్రీ రామనవమి పండుగ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని చిన్న బురాడ పేట గ్రామంలో గ్రామ ప్రజల ఆహ్వానము మేరకు రామమందిరంలో జరుగుతున్న పూజకు నెల్లిమర్ల జనసేన ఇంచార్జ్ లోకం మాధవి హాజరయ్యారు. అక్కడ సుమారు 60 మంది రైతులు గత మూడేళ్లుగా చెరువుకి గండిపడటంతో ఎంతో నష్టపోయారని తెలుసుకొన్న ఆమె  గత ఆదివారం వారిని కలసి వారి పొలాల గండి పూడ్పించడం జరిగింది. ఆ గండి పూడ్పించడానికి అయిన మొత్తం ఖర్చు పండుగరోజు గ్రామ పెద్దల సమక్షంలో ఆ రైతాంగానికి అందజేశారు. అలాగే వారు గత 3 ఏళ్లుగా దాదాపు 300 ఎకరాలు పైచిలుకు ఉన్న భూమిలో నడవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుందని తెలియజేశారు. వారు తింటున్న క్యారేజీలు కానీ, యూరియా బస్తాలు కానీ మోయటం ఎంతో కష్టతరంగా ఉందని, అదే వర్షాకాలంలో అయితే వారి బాధ వర్ణనాతీతం అని అక్కడి ప్రజలు మాధవి గారికి తెలపడంతో వారి రాస్తా నిర్మాణానికి తమ వంతు సహాయం అందచేస్తామని మాధవి గారు భరోసా కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way